kcr-smilingకేసీఆర్ క్యాబినెట్ లో మరో ఆరుగురు కొలువుదీరనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు అందుకు ముహుర్తం ఖరారైంది.  రాజ్ భవన్ లో  ఈ కొత్త అమాత్యులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే రెండో సారి జరుగుతున్న విస్తరణలోనూ మహిళలకు మాత్రం స్థానం దక్కలేదు. 

 మరికొద్ది గంటల్లో  కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మొదటి దఫాలో 11 మంత్రులు, సీఎం తమ బాద్యతలు చేపట్టారు. దీంతో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటిని మలిదఫా లో సీఎం కేసీఆర్ భర్తీ చేస్తున్నారు. అందులో అదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి జూపల్లి క్రిష్ణారావు, లక్ష్మారెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్రావు, వరంగల్ నుంచి చందులాల్, హైద్రాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు మంత్రివర్గంలో చేరనున్నారు.
అయితే తలసాని టీడీపీ నుంచి గెలిచినందున ఆయన ను మంత్రి వర్గంలో చేర్చుకోవాలా లేదా అన్న దానిపై సీఎం సీనియర్లతో మంతనాలు జరిపారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి గా రాజీనామా చేయించాలని యోచిస్తున్నారు కేసీఆర్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందో వెనకో తలసాని రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కర లేదంటున్నారు సీఎం సన్నిహిత్తులు.

అయితే మంత్రి పదవులపై ఎక్కువ మంది ఆశ పెట్టుకోవడంతో వారిని సీఎంతో సహ సీనియర్ నేతలు బుజ్జగించారు. ఓపికతో ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. చీఫ్ విప్ పదవిని నిరాకరించిన కొప్పుల ఈశ్వర్ తో సీఎం మాట్లాడిన తర్వాత శాంతించారు. ఆరు నెలల్లోపు తగిన ప్రాధాన్యమిస్తానని హమీ ఇచ్చారు. దీంతో ఆయ న కాస్త మొత్త బడ్డారు.

ఇక కొండా సురేఖ సైతం మంత్రి పదవి ఆశించారు. సీనియర్ నేత కేకే తో కలిసి సీఎం కేసీఆర్ సచివాలయానికి పిలిచి ఆమేకు నచ్చజెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. 

ఇక మంత్రులుగా అవకాశం దక్కని వారికి, సీనియర్లకు నామినేటెట్ పదవులు కట్టబెడుతున్నారు. సీఎం సన్నిహితుడైనా మహబుబ్ నగర్ జిల్లా నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా నియమించారు. ఇక పార్టీ ఎమ్మెల్యేలు కోవా లక్షీ, వినయ బాస్కర్, శ్రీనివాస్ గౌడ్, జలగం వెంకట్రావు లకు  పార్లమెంట్ కార్యదర్శులుగా నియమించారు. మరో ఇద్దరికి సైతం ఇదే బాధ్యతలు అప్పగించనున్నారు. మరో ఆరుగురు ఎమ్మెల్యేలకు క్యాబినెట్ హోదా ఉన్న కార్పోరేషన్లనకు చైర్మన్లుగా నియమించాలని నిర్ణయించారు.