jaganజగన్ మీద, వైఎస్సార్సీపి మీద మంద  కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. సోనియా, జగన్ ల  ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. జగన్ ఎప్పటికైనా కాంగ్రెస్ పంజరంలో చిలకేనన్నారు. జగన్ ను తన చెప్పు చేతల్లో పెట్టుకొని సోనియా ఆడిస్తున్నారని చెప్పారు. జగన్ చేసిన లక్షల కోట్ల అవినీతికి ఆయనకు జీవితకాల శిక్ష పడాల్సిందేనని, సిబిఐ కేసులో ఆయనకు శిక్ష తప్పదని కూడా అన్నారు.

రాహుల్ ను ప్రధాని చేయాలనే ఒప్పందంలో భాగంగానే, జగన్ ను జైలు నుంచి విడుదల చేశారని మంద కృష్ణ ఆరోపించారు. మాట వినకపోతే మళ్లీ జైలుకు పంపిస్తామన్న భయంలో జగన్ ను ఉంచారని కూడా ఆయన అంటున్నారు. ప్రతిపక్ష పార్టీకి ఒట్లు పడకుండా సీమాంధ్రలో జగన్ ను ఎగదోస్తున్నారని కూడా మంద కృష్ణ ఆరోపించారు. ఈ నెల ఆరో తేదీన గుంటూరులో అంబేద్కర్ ఆశయాల మేరకు తెలంగాణ  ఏర్పాటు సభను నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.

జగ్గారెడ్డి అభ్యంతరం

జగన్ హైదరాబాద్ లో సమైక్య శంఖారావం పేరుతో భారీ సభ పెడతామని ప్రకటించడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. అందరూ ఒప్పుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ను ప్రకటించిందని ఆయన అన్నారు.