వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ మాటల్ని వివాదం చేయటానికి జరుగుతున్న ప్రయత్నాలను ఎస్వీ రంగారావు మనవళ్లు ఖండించారు. బాలకృష్ణకి, ఎస్వీఆర్ కుటుంబానికి మంచి సంబంధాలున్నాయని, బాలకృష్ణ మాట్లాడిన దాంట్లో తమకేమీ చెడు కనిపించలేదని వాళ్లు స్పష్టం చేశారు. ఇదీ వారి ప్రకటన:

నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు వుండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం.

ఎస్వీ రంగారావు (చిన్న) సినీ నటుడు,
ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు (బాబాజీ),
స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి మనవళ్లు