ఏపీ (AP) డీజీపీ (DGP K.V. Rajendranath Reddy)కి టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు. ఈనెల 27 నుంచి లోకేష్ (Lokesh) యువగళం పాదయాత్రకు అనుమతి కోరుతూ లేఖలో పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతితో పాటు భద్రతా ఏర్పాటు చేయాలని లేఖ రాశారు. లేఖను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి జత చేశారు. లోకేష్‌ను టార్గెట్ చేస్తూ ఇటీవల కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయ వ్యతిరేకులు, ఫ్యాక్షనిస్టుల నుంచి లోకేష్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరారు.